Assembly Polls: ఎన్నికలు త్వరలోనే జరగబోతున్నటువంటి నేపథ్యంలో అన్ని పార్టీ నాయకులు ప్రజలను ఆకర్షించడం కోసం పెద్ద ఎత్తున కానుకలను అందించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే కొంతమంది ఇప్పటికే పెద్ద ఎత్తున ఓటర్లను ప్రభావితం చేయడం కోసం తాయిలాలను అందిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఆంధ్రప్రదేశ్లో ఇంకా ఎన్నికల షెడ్యూల్ ప్రకటించనేలేదు అప్పుడే కొందరు నేతలు ఓటర్లను ఆకర్షించే పనిలో ఉన్నారు.
ఇక ఈ ఎన్నికల తాయిలాలను అందజేసే విషయంలో వైసిపి నాయకులు ముందంజలో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ఒక నియోజకవర్గంలోని నాయకులను మరొక నియోజకవర్గ అభ్యర్థులుగా ప్రకటించడంతో ఆ నియోజకవర్గంలో తమకు ఎవరు సరిగా తెలియక పోవడం ఓటర్లను ఆకర్షించడం కోసం పెద్ద ఎత్తున కానుకలను అందిస్తున్నారు.
చిన్న, పెద్ద నేతలు చేతిలో చీర, కుక్కర్లు, వాచీలాంటి ఏదో ఓ ఉపకరణంతో ఓటర్లను ఆకర్షిస్తున్నారు. రాత్రిళ్లు ఇంటింటికీ తలుపుకొట్టి మరీ తాయిలాలు పంచుతున్నారు. పల్నాడు జిల్లా పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరు శంకరరావు అనుచరులు, వైసీపీ నాయకులు చీకటి పడగానే ఆయా గ్రామాల్లో వాలంటీర్లను వెంటేసుకొని కుక్కర్లు పంపిణీ చేస్తున్నారు.
కుక్కర్లో పంపిణీ చేసే బాక్స్ లపై ఎమ్మెల్యే నంబూరు శంకరరావుతో పాటు సీఎం జగన్, నరసరావుపేట ఎంపీ అభ్యర్థి అనిల్కుమార్ అనే స్టిక్కరు వేసి మరీ ఓటేయాల్సిన గుర్తును గుర్తుచేస్తున్నారు. పార్వతీపు రం మన్యం జిల్లాలో పార్వతీపురం ఎమ్మెల్యే జోగారావు ఈ నెల 3న సీతానగరం మండలం పణుకుపేటలో మహిళకు చీర, రూ.500 ఇచ్చారు. ప్రాప్తాడులో కూడా వాలంటీర్లు అందరికీ వాచీలను అందజేశారు ఎలా ప్రతి ఒక్క నియోజకవర్గంలోనూ ఎమ్మెల్యేలు ఓటర్లను ప్రభావితం చేయడం కోసం పెద్ద ఎత్తున కానుకలను అందజేస్తున్నారు.