Ys Jagan-Bharathi: తెలుగు రాష్ట్రాల్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నో కొత్త సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రజలకు అండగా నిలిచారు. వైఎస్ ప్రవేశపెట్టిన సంక్షేమ పధకాలను ఇప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో అమవుతున్నాయంటే.. ఆయన ప్రవేశపెట్టిన పథకాలు ప్రజలకు ఎంత మేస్తు్న్నాయో కొత్త చెప్పనక్కర్లేదు. ఆరోగ్య శ్రీ, ఫీజురీయింబర్స్ మెంట్ లాంటి పథకాలు నేటికీ కొనసాగుతూనే ఉన్నాయి. ఎన్ని ప్రభుత్వాల మారినా వైఎస్ ప్రవేశపెట్టిన పథకాలు ప్రజలకు అవసరమయ్యేవి కావడంతో ఆ పథకాలను తీసేందుకు ఏ పార్టీ సాహసం చేయడం లేదు.
అయితే వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఫ్యామిలీకి కూడా తెలుగు రాష్ట్రాల్లో గుర్తింపు ఉంది. తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చుకుని వైఎస్ జగన్ కొత్త పార్టీని స్థాపించి అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇక జగన్ సతీమణి భారతి బిజినెస్ వ్యవహారాలు చూసుకుంటోంది. సాక్షి మీడియా, భారతి సిమెంట్ తో పాటు వైఎస్ ఫ్యామిలీకి ఉన్న ఇతర వ్యాపార వ్యవహారాలను భారతి చూసుకుంటున్నారు. తాజాగా జగన్ దంపతుల ఫొటో సోషల్ మీడియాల వైరల్ గా మారుతోంది.
1996 ఆగస్ట్ 28న జగన్, భారతీల పెళ్లి జరిగింది. అంటే వీరి విశాహనం జరిగింది. 26 సంవత్సరాలు పూర్తయింది. దీంతో జగన్-భారతి పెళ్లి ఫొటోలు, వెడ్డింగ్ కార్డు ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఈ వివాహ పత్రిక అందరినీ ఆకట్టుకుంటోంది. కడప జిల్లా పులివెందులలోని వైఎస్సార్ లయోలా డిగ్రీ కాలేజీలో బుధవారం నాడు ఉదయం 10.30 నుండి 11.15 గంటల మధ్య వీరి వివాహం జరిగింది. అప్పటికి జగన్ వయసు 24 ఏళ్లు మాత్రమే.
జగన్ పెళ్లి సమయంలో కడప కాంగ్రెస్ ఎంపీగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నారు. ఇక జగన్ అప్పుడు వ్యాపారాలు చూసుకుకంటూూ బెంగళూరులో ఎక్కువగా ఉండేవారు. ఇదే ముహూర్తానికి వివేకానందరెడ్డి కూతురు సునీత పెళ్లి కూడా జరిగింది. ఇవాళ జగన్, భారతీల పెళ్లి సందర్భంగా పెళ్లి ఫొటోలు వైరల్ గా మారుతున్నాయి.