YS Sunitha: గత ఎన్నికలకు కొద్ది రోజుల ముందు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు అందరినీ ఒక్కసారిగా షాక్ కి గురిచేసింది అయితే వయసు వివేకానంద రెడ్డి మరణించి ఐదు సంవత్సరాలు అవుతున్న ఇప్పటివరకు ఈయన హత్యకు గల కారకులు ఎవరు అనే విషయాలని గుర్తించి వారిని అరెస్ట్ చేసే విషయంలో ఏపీ ప్రభుత్వం విఫలమైందనే విషయం తెలిసిందే.
ఇకపోతే వైయస్ వివేకానంద రెడ్డి వర్ధంతి సందర్భంగా కడపలో స్మారక సభను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె వైఎస్ సునీత మాట్లాడుతూ చేసినటువంటి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. నాన్న చెప్పినవారికి ఇప్పటివరకు శిక్ష పడకపోవడమే కాకుండా ఆ హత్య తన కుటుంబమే చేసింది అంటూ ఆరోపణలు చేయడం చాలా బాధ కలిగించదని తెలిపారు. తన కుటుంబమే హత్య చేసి ఉంటే ఇప్పటివరకు ఎందుకు అరెస్టు చేయలేదని ఈమె ప్రశ్నించారు.
నాన్న మనకు దూరమై ఐదు సంవత్సరాలు అయింది. నాన్నకు ఇలాంటి కీడు ఎందుకు చేశారని అనుకుంటున్నా అటువంటి తరుణంలోనే జగనన్న ముఖ్యమంత్రి అయ్యారు. ఈయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే సమయంలో ప్రజలందరికీ న్యాయం చేస్తానని చెప్పగా అంతా ఎంతో గర్వపడ్డాము. అయితే మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలని ఉంది అంతఃకరణ శుద్ధి అంటే అర్థం ఏంటో మీకు తెలుసా అంటూ సునీత ప్రశ్నించారు.
వివేకానంద రెడ్డిని చంపిన, చంపించిన వారికి ఇప్పటివరకు ఎందుకు శిక్ష పడలేదు మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయారా? ఆయనని సొంత కుటుంబ సభ్యులే హత్య చేశామని చెప్పడానికి నీకు ఎబ్బేట్టుగా అనిపించడం లేదా జగనన్నా? వైయస్ వివేకానంద రెడ్డిని చంపిన వారిని పట్టిస్తే సీబీఐ ఐదు లక్షల బహుమానం ప్రకటించింది మమ్మల్ని పట్టించి ఆ బహుమానం అందుకో జగనన్నా అంటూ సునీత ఈ సందర్భంగా చేసినటువంటి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.