Vivekananda Murder: హూ కిల్డ్ బాబాయ్.. కూతురు, అల్లుడు చంపించారనే ప్రచారం వెనుక వైసీపీ ప్లాన్ ఇదేనా?

Vivekananda Murder: గత ఎన్నికల ముందు వైయస్ వివేకానంద రెడ్డి హత్య జరగడం అందరిని ఒక్కసారిగా ఉలిక్కిపాటుకు గురిచేస్తుంది. అయితే ఈయన గుండెపోటుతో మరణించారని ముందు వైకాపా నాయకులు పెద్ద ఎత్తున కథలు నడిపించారు కానీ ఆయనది హత్య అని తెలిసింది. ఇలా వివేకానంద రెడ్డి చనిపోయి దాదాపు 5 సంవత్సరాల అవుతున్న ఇప్పటివరకు ఈ కేసులో నిందితులను సిబిఐ వారు పట్టుకోకపోవడం అందరిలోనూ ఎన్నో సందేహాలను కలిగేలా చేస్తుంది.

ఇకపోతే తన తండ్రి మరణించి ఐదు సంవత్సరాలు అవుతున్న ఇప్పటివరకు తనకు న్యాయం జరగలేదంటూ ఇటీవల సునీత ప్రెస్ మీట్ పెట్టి అధికార ప్రభుత్వం పై తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపించారు. అయితే ప్రస్తుతం వైసీపీ నేతలు యూటర్న్ తీసుకొని వివేకానంద రెడ్డిని తన కుమార్తె అల్లుడు చంపేశారు అంటూ పెద్ద ఎత్తున తప్పుడు ప్రచారాలను మొదలుపెట్టారు.

ఈ విధంగా తన తండ్రిని తన కుమార్తె అల్లుడే చంపారు అంటూ పెద్ద ఎత్తున వార్తలను ప్రచారం చేయడం వెనుక వైసిపి స్ట్రాటజీ ఉందని తెలుస్తోంది. అయితే హూ కిల్డ్ బాబాయ్ అనే ప్రశ్న ఎదురైతే దీనికి సమాధానం అందరికీ తెలుసు ఒక్క సీబీఐకి తప్ప. అన్ని ఆధారాలు ఫోన్ కాల్స్ డేటా ఉన్నప్పటికీ సిబిఐ ఎందుకు ఈ హత్య కేసులో నిందితులను అరెస్టు చేయలేదు ఇప్పటివరకు అర్థం కాని విషయం.

తీరా ఎన్నికల ముందు సునీత తన బాధను మొత్తం బయట పెట్టడంతో వైసిపి నేతలు మాత్రం ఈ కుట్ర తన కుమార్తె అల్లుడే చేశారు అంటూ వారిని నిందితులుగా భావిస్తున్నారు. ఇక వివేకానంద రెడ్డి చనిపోయారని ఉదయం 6 గంటలకు అందరికీ తెలిసినప్పటికీ మూడు గంటలకే ఈ విషయం చేరాల్సిన వారికి చేరిందని అప్పటినుంచి ఇది హత్య కాదు గుండెపోటుతో మరణించారని చెప్పడానికి పెద్ద ఎత్తున ప్లాన్స్ వేశారని తెలుస్తుంది. ఇలా ఎన్ని ఆధారాలు ఉన్న సిబిఐ మాత్రం ఈ కేసులో నిందితులను అరెస్టు చేయకపోవడం విడ్డూరం.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -