Kodali Nani: రూల్స్ కు విరుద్ధంగా తిరుమల శ్రీవారి ఆలయంలోకి వెళ్లిన కొడాలి నాని.. పాపం చేశాడంటూ?

Kodali Nani: తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి గురించి మనందరికీ తెలిసిందే. ఏడాది పొడవునా శ్రీవారి ఆలయం భక్తులతో కిక్కిరిసిపోతూ ఉంటుంది. రోజు లక్షల సంఖ్యలో భక్తులు శ్రీవారిని దర్శించుకుంటూ ఉంటారు. కేవలం సామాన్యులు మాత్రమే కాకుండా పెద్దపెద్ద సెలబ్రిటీలు రాజకీయ నాయకులు కూడా స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. అయితే ఎవరూ దర్శించుకున్న కూడా ఒక పద్ధతి ప్రకారం టిటిడి రూల్స్ ప్రకారం నడుచుకోవాలి అన్న విషయం తెలిసిందే. అయితే టీటీడీ రూల్స్ కేవలం సామాన్యులకు మాత్రమే వర్తిస్తాయా? రాజకీయ నాయకులకు వర్తించవా అంటే అందరికీ ఒకే రూల్స్ వర్తిస్తాయి అని చెప్పవచ్చు.

కానీ తాజాగా మాజీ మంత్రి గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని మాత్రం రూల్స్ ని అతిక్రమించారు. ఇంతకీ ఏం జరిగిందంటే…తాజాగా తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఈ బ్రహోత్సవాల లాంటి సమయాల్లో పట్టువస్త్రాలు తీసుకువస్తారు కాబట్టి సీఎంకు తోడుగా కొంతమంది మంత్రులు కూడా ఆలయ మహాద్వారం నుంచి ఆలయంలోకి వెళ్తారు. కానీ కొడాలి మాజీ మంత్రి. గుడివాడ ఎమ్మెల్యే కావడంతో అధికారులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఎందుకంటే ఆయనకు మహాద్వారం నుంచి ప్రవేశించేందుకు నిబంధనలు అంగీకరించవు. అందుకే విజిలెన్స్ అధికారి బాలిరెడ్డి కొడాలి నానికి నమస్కరిస్తూనే సున్నితంగా ఆయన్ను లోనికి వెళ్లటానికి వీలు లేదని ఆపారు.

కానీ తననే ఆపుతారా అన్నట్లు చూసిన కొడాలి నాని వీజీవోతో వాగ్వాదానికి దిగబోయారు. ఈ లోగా అక్కడే టీటీడీ సీవీ అండ్ ఎస్వో నరసింహ కిషోర్ కొడాలి నానిని లోపలికి పంపించారు. నిబంధనలు అంగీకరించపోయినా విజిలెన్స్ సిబ్బంది ఆపినా ఆగని కొడాలి నాని పై భక్తులు మండిపడుతున్నారు. టీటీడీ రూల్స్ సామన్యూలకేనా కొడాలి నాని లాంటి మాజీ మంత్రులకు వర్తించవా అంటూ ప్రశ్నిస్తున్నారు. టీటీడీ నిబంధనలను ఉల్లంఘిస్తూ ఏకంగా స్వామి వారి మహాద్వారం నుంచే ఆలయంలోకి ప్రవేశించారు. వాస్తవానికి రాష్ట్రపతి నుంచి మొదలుకుని ముఖ్యమంత్రి వరకూ ఓ స్థాయి ఉన్న ప్రభుత్వాధినేతలకు, పాలకులు మాత్రమే మహాద్వారం నుంచి తిరుమల ఆలయంలోకి నేరుగా ప్రవేశించవచ్చు. అందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -